Chada Sastry గారి వాల్ మీద నుండిమోడీ భారత ఆర్ధిక వ్యవస్థను నాశనం చేసేస్తున్నాడు. రూపాయితో డాలర్ విలువ పడిపోతోంది అని రాహుల్ గాంధీ గారు మిగతా ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నారు.
ఒక సారి ఇది చూడండి..ఎవరు ఆర్ధిక వ్యవస్థ చక్కగా నడుపుతున్నారో?
2008 డాలర్ విలువ ₹43.51ps ఉంటే అది 2014లో మన్మోహన్ గారు దిగే సమయానికి ₹62.33ps చేరింది. అంటే 2008 నుండి 2014 మధ్య 6 సం.లలో డాలర్ తో రూపాయి విలువ సుమారు ₹18.82 ps తగ్గిపోయింది..
అప్పుడు ప్రముఖ ఆర్ధిక వేత్త బాగా చదువుకున్న అపర ఆర్ధిక మేధావి మన్మోహన్ గారు ప్రధాని మరియు హార్వార్డ్ లో MBA చదువుకున్న శ్రీ చిదంబరం గారు ఆర్ధిక మంత్రిగా వున్నారు..
అప్పుడు అంటే 2014 మోడీ ప్రభుత్వం వచ్చేసరికి విదేశీ మారక ద్రవ్య నిలువలు
$304.20 బిలియన్ డాలర్లు మాత్రమే. అంటే
₹22.80 లక్షల కోట్లు ఉన్నాయి. (ఒక$ 75రూ. చొ.)
సరే ! మరి 2014-2020 మధ్య 6 సం.లలో డాలర్ తో రూపాయి విలువ చూడండి.
2014 లో ₹62.33ps ఉంటే నేడు 10.01.2020 డాలర్ విలువ ₹73.38 ps ఉంది.
అంటే సుమారు ₹11.05ps మాత్రమే తగ్గింది.
ఇప్పుడు ఒక చదువు రాని చాయ్ వాలా ప్రధాని
విదేశీ చదువులు లేని సాధారణ గృహిణి ఆర్ధిక శాఖా మంత్రి.
ఇప్పుడు విదేశీ మారక ద్రవ్య నిలువలు
$541.62 బిలియన్ డాలర్లు.. అంటే రూపాయల్లో చెప్పాలి అంటే ₹40.62 లక్షల (ఒక$ 75రూ. చొ.) కోట్లు ఉన్నాయి. అప్పటి కంటే సుమారు ₹18 లక్షల కోట్ల రూపాయల మేర విదేశీ మారక నిల్వలు పెరిగాయి.
అందుచేత ఎవరైనా మోడీ ఆర్ధిక వ్యవస్థను నాశనం చేస్తున్నాడు అంటే గట్టిగా సమాధానం చెప్పండి.
DATA SOURCE : BookMyForex.Com

No comments:
Post a Comment