ఆ మధ్య హంపి వెళ్లి చూసినపుడు కలిగిన బాధానుభూతులే ఈ పేరడీ పాటకు ప్రేరణ :
అహో అంధ రాజా! ఓ క్రూర ముష్కర పాలకా!
విజయనగర విధ్వంస కర్కశ కఠినాత్ముడా !
ఈ శిలలలో రుధిరాన్ని చిమ్మినావయా !
శిలలపై పంతాలు పట్టినారు
శిలలపై పంతాలు పట్టినారు
ముష్కరులు సృష్టి కే గునపాలు
గుచ్చినారు ..ఊ..ఊ.. "శిలాలపై"
బండ గుండెల గల వారికైనా
బండ గుండెల గల వారికైనా
కరిగించి కన్నీరు తెప్పించగల వీటిపై
శిలలపై పంతాలు పట్టినారు...ఊ...ఊ..
ఒకవైపు ఉన్మాదమూక కవాతులు
ఒక పక్క మతమౌఢ్య వర్గశత్రువులూ
ఒకచెంప క్రూరాతి క్రూర ముఖాలు
ధ్వంస రచనచేయ నగరానికొచ్చారు
కనులు ఉండికూడా కబోదులయ్యారు
కనులు ఉండికూడా కబోదులయ్యారు
శిలల కంటే కూడా హీనమనిపించారు....శిలల
ఏకశిల రథమును భారిసుత్తులతోనా
తుత్తినియలు చేయ విఫలమైనారు
ఏకశిల రథమును భారిసుత్తులతోనా
తుత్తినియలు చేయ విఫలమైనారు
రాతి స్థంబాలచే రాక్షసత్వముతో
విలాపరాగాలు వినిపించుకున్నారు
వెతలు తీర్చెదన్న విరూపాక్ష సన్నిధిని
వెతలు తీర్చెదన్న విరూపాక్ష సన్నిధిని
విడవ కుండాకూడా విరిచేసేలాగా..
శిలలపై పంతాలు పట్టినారు ....ఊ.. ఊ..
బొమ్మలే విర్చినా కంబాలు కూల్చినా
కరములే నరికినా తలలు ఖండించినా
బెదరని చెదరని శిల్పాల వలనే
ఈ దేశ సంస్కృతి గళమెత్తి శిరమెత్తి
నిలిచి ఉండును సదా...నిజముగా..సనాతనా..
...చాడా శాస్త్రి...

No comments:
Post a Comment