Thursday, 14 January 2021

మోడీని ఎందుకు అభిమానిస్తున్నావ్

 కొందరు రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసిన మోడీని ఎందుకు వెనకేసుకు వస్తున్నావ్ అని అడుగుతున్నారు..

నేను మన స్టేట్ కి గత 60సం.ల బట్టి జరుగుతున్న అన్యాయం గురించి బాధపడుతున్నాను.
మీరందరు ఈ 13 జిల్లాలు 2014 తరువాత మాత్రమే కొత్తగా పుట్టినట్లు కాంగ్రెస్, తెదేపా ఈ 13 జిల్లాలను పూర్వం ఎప్పుడూ పాలించనట్లు మాట్లాడుతున్నారు.

ఉదా:
రాష్ట్రం విడిపోవడానికి, పోలవరానికి, కడప స్టీల్ ప్లాంట్ కి  రైల్వే జోన్ కి ఏమిటీ సంబంధం? అంటే రాష్ట్రం విడిపోక పోతే అవి మనకు అవసరం లేదా? మోడీ ఇప్పుడు అవి ఇవ్వలేదని గొడవ పెడుతున్నాం. అంత ముఖ్యమైనవి అయితే గత 30 సం.లుగా అవి ఎందుకు తెచ్చుకోలేకపోయారో  మనలని ఇంతకు ముందు పాలించిన పెద్దలు చెప్పవలసిన బాధ్యత లేదా?


అసలు ఎంతో సారవంతమైన  జిల్లాలు, పేరు ప్రఖ్యాతులు గాంచిన పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు, సినిమా రంగం వాళ్ళు ఈ 13 జిల్లాలు వాళ్లే కదా?


50/60 సం.ల పాలన తరువాత మా జిల్లాలు వెనకబడి ఉన్నాయి, హైదరాబాద్ పోవడం తో అనాధలం అయిపోయాం స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని ముష్టి ఎత్తుకోవలసిన అవసరం ఏం వచ్చింది?
ఎవరు దీనికి కారకులు ?


70 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్/తెదాపా లా? బీజేపీ నా?  వాళ్ల 70 ఏళ్ల తప్పులు కప్పి పుచ్చుకుందికి బీజేపీ ని తిడితే మనం స్వంత ఆలోచన లేకుండా తందాన తానా అంటున్నాం. మనకు 25 మంది.లోక్ సభ ఒక 10 మంది రాజ్యసభ ఎంపీ లు ఉంచుకొని
ఎవడో వెంకయ్య నాయుడు, ఇంకెవరో సుష్మ స్వరాజ్ మన రాష్ట్రానికి సంబంధించి ఇవి ఇవ్వండి అని పార్లమెంట్ లో ఎందుకు అడిగారు? మన వాళ్ళు ఏంచేస్తున్నారు ? 40 సం.ల అనుభవం ఉన్న రాష్ట్ర రాజకీయనాయకులు నిద్రపోయారా విభజన బిల్లు చదవకుండా?


బీజేపీ కి ఆంధ్రా తో ఉన్న సంబంధం ఏమిటి? ఎన్ని సార్లు ఎన్ని ఎంపీలను ఎమ్మెల్యేల ను ఎన్నుకున్నాం? వారిని తిట్టడానికి మనకు ఏ నైతిక హక్కు ఉంది.
మొన్న ఒక మీటింగ్ లో మన ముఖ్యమంత్రి గారు వేరే పార్టీనుండి వారి పార్టీలోకి మారిన ఎమ్మెల్యే తో ఏం అన్నారు? నువ్వు పూర్వం చాలా చేసిపెట్టమని నన్ను అడిగినా నువ్వు వేరే పార్టీలో ఉండడం చేత అవి నీకు అవి చేసి పెట్టలేదు అని చెప్పారు. 


ఎమెర్జెన్సీ తరువాత దేశం అంతా కాంగ్రెస్ ని ఒడిస్తే మనం గెలిపిస్తే తరువాత అధికారంలోకి వచ్చాక ఆంధ్రాకి కాంగ్రెస్ ప్రత్యేకంగా చేసిన సాయం ఏమిటీ  ?. 
2004 లో సోనియా ప్రభుత్వం ఏర్పడడానికి మన రాష్ట్రం పంపిన 32 ఎంపీలు ముఖ్య  కారణం కాదా? 
వాజపాయ్ చక్కని పాలన అందించినా బాబు గారి మీద  కోపంతో తెదేపాకి ఎంపీ సీట్లు రాకుండా తద్వారా వాజపాయ్ ని కేంద్రంలో అధికారంలోకి రాకుండా అవ్వడానికి మనం ఒక ముఖ్య కారణం కాదా?
కాంగ్రెస్ కి అంత సహాయం చేసిన మన ఆంధ్రాకి కాంగ్రెస్ 2014 వరకు 10 సం.ము లు అధికారం అనుభవించి చివరికి ఆఖరు సమయంలో ఆంధ్రా ఇబ్బందులు కనీసం పట్టించుకోకుండా రాష్ట్రం విడగొట్టలేదా?
ఇప్పుడు అదే కాంగ్రెస్ చాలా గొప్పది నమ్మండి అని ఎవడో వెధవ వాడి రాజకీయ స్వార్ధం కోసం చెపితే అవును గొప్పది
అని మళ్ళీ మనం పొగడటం లేదా?
పూర్వం కాంగ్రెస్ కానీ తెదేపా ఎప్పుడూ తెచ్చుకోలేనన్ని ప్రాజెక్టులు, విద్యాలయాలు నిదులు మోడీ ప్రభుత్వ హయాంలో గత 5 సం.లలో వచ్చాయి..మోడీకి విభజన బిల్లు 10 సం.ల సమయం ఇచ్చింది. కానీ 90% కి పైగా విభజన బిల్లులో అంశాలు మోడీ ప్రభుత్వం ఇచ్చింది..


మోడీ ఆంధ్రాకి ఏమి చేయలేదు అన్నవారు 2014 ముందు -


1. 24/7 కరెంటు ఉండేదా? లేదు. దేశంలో 24/7 కరంటు ఇవ్వడానికి కేంద్రము AP ని ముందు గా ఎన్నుకుంది


2. 2014 ముందు విభజన బిల్లులో పోలవరం 7 మండలాలు కలిపారా?
     లేదు. మోడీ ప్రభుత్వం వచ్చాక  మొట్టమొదటి ఆర్డినెన్స్ ఇదే.


3. ఉద్యోగుల కోసం హైదరాబాద్ నుండి గుంటూరు ప్రత్యేక రైల్ నడపాలి అన్న ప్రస్తావన బిల్లులో ఉందా?
లేదు. కానీ ఆంధ్రా ప్రభుత్వం అడిగిన వెంటనే సాంక్షన్ చేశారు


4. రాజధానిలో భూములమ్ముకున్న రైతులకు కాపిటల్ గెయిన్స్ టాక్స్ ఎగ్జిమ్ప్షన్ ఇవ్వమని బిల్లులో ఉందా?
లేదు. అయినా కేంద్రం ఇచ్చింది. చాలా మంది రైతులకు లక్షల్లో మిగిలింది.


5. 2014 ముందు టీడీపీ కాంగ్రెస్ 60 సం.లు పై బడి పాలించారు కదా..ఆంధ్రాకి AIIMS గురించి.ప్రయత్నించారా?
లేదు. విభజన చట్టంలో 10 సం.ల సమయం ఇచ్చారు. కానీ 5 సం.ల.లోపే ప్రారంభించారు మోడీ ప్రభుత్వం.


6. 2014 ముందు టీడీపీ, కాంగ్రెస్ 60 సం.ల పై చిలుకు పాలించారు. ముఖ్య నగరాలైన గుంటూరు, విజయవాడ కి భూగర్భ డ్రైనేజ్ గురించి పని మొదలెట్టారా?
లేదు. మోడీ ప్రభుత్వం వచ్చాకే ఈ పనులు మొదలు అయ్యాయి.


7..2014 ముందు అసలు విశాఖ, విజయవాడ, తిరుపతి, కాకినాడ ఎలా ఉండేవి. 
2014 తరువాత వాటిని స్మార్ట్ సిటీస్ గా గుర్తించాక ఇప్పుడు ఎలా ఉన్నాయి?


8. 2004-14 మధ్య 10 సం.లు కాంగ్రెస్ కేంద్రం లోనూ రాష్ట్రంలోనూ కూడా పాలించింది కదా! పోలవరం ఎందుకు పూర్తిచేయలేకపోయింది?
2014 ముందు వరకు ఎన్ని నిధులు వచ్చాయి. 2014-18 మధ్య ఎన్ని నిధులు వచ్చాయి


9. ఐఐఎం, ఐఐటీ, ఐఐఐటీ, గిరిజన యూనివర్సిటీ, మెరైన్ ఇన్స్టిట్యూట్, ఫ్యాషన్ డిజైన్ ఇన్స్టిట్యూట్, ఇలా సుమారు 20 విద్యా సంస్థలు కొన్ని విభజన బిల్లు లో లేనివి కూడా 2014 ముందు వుండేవా?
లేవు 2014 తరువాత మాత్రమే వచ్చాయి.


10. వీధుల్లో 2014 ముందు led దీపాలు వుండేవా? 
     లేవు. మోడీ ప్రభుత్వం వచ్చాకే ఇవి వచ్చాయి


11. తిరుపతి, విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాలు 2014 ముందు ఎలా ఉండేవి?
ఎన్ని విమానాలు ఉండేవి?2014 తరువాత ఇప్పుడు ఎలా ఉన్నాయి?

12. కోటిపల్లి -నరసాపురం రైల్వే లైన్ 60 సం.ల బట్టి పెండింగ్ లో ఉంది. మోడీ వచ్చాక పనులు మొదలు అయ్యాయి. 50% పైగా పనులు పూర్తి అయ్యాయి.


13. పిఠాపురం-కాకినాడ రోడ్డు వెడల్పు కార్యక్రమం దశాబ్దాల బట్టి పెండింగ్. మోడీ ప్రభుత్వం వచ్చాకే దానిని 4 లేన్లు గా పెంచి హై వే కింద పని పూర్తి చేశారు.


14. తెనాలి -విజయవాడ మూడో లైన్ లేక మద్రాస్ ట్రైన్స్ విజయవాడ వచ్చేవి, వెళ్ళేవి చాలా ఆలస్యం అయ్యేది. మోడీ ప్రభుత్వం వచ్చాకే లైన్ పని ప్రారంభించి పూర్తి చేశారు.


15. 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విశాఖ మెడ్ టెక్ సిటీ మోడీ ప్రభుత్వం వచ్చాకే ప్రారంభం జరిగింది.


16. అనంతపురం దగ్గర  కేంద్ర ప్రభుత్వ సంస్థ BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 750 కోట్లతో ప్రాజెక్ట్ ప్రారంభించింది.ఇది కూడా మోడీ ప్రభుత్వం వచ్చాకే.


17. కృష్ణ జిల్లాలో శ్రీహరికోటలాగా వెయ్యి కోట్ల ఖర్చుతో మరొక లాంచింగ్ పేడ్ DRDO వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయి. ఇది కూడా మోదీ ప్రభుత్వ హయాంలోనే.


18. పూర్వం ఎప్పుడైనా ఆంధ్రాలో ఒకే సారి కేంద్ర ప్రభుత్వం బీద వారికి ఇన్ని గృహాలు మంజూరు
చేసిందా ? సుమారు 7 లక్షల గృహాలు ఇచ్చింది.


19. UPA టైంలో 10 సం.లు పడుకున్న 6 వరుసలు నేషనల్ హైవే రణస్థలమ్-నరసన్నపేట 1500 కోట్ల ఖర్చుతో మోడీ ప్రభుత్వమే పని ప్రారంభించింది కదా!


20. మోడీ ప్రభుత్వం make in india అన్న తరువాతే కదా దేశంలో పరిశ్రమలు పెట్టడానికి వెంట వెంటనే క్లియరెన్స్ లు వస్తున్నాయి.పూర్వం ఒక్క ఎన్విరాన్మెంటల్ క్లియరన్స్ రావడానికే 2-3 సం.ల టైం పట్టేది. బోలెడు లంచాలు ఇవ్వవవలసి వచ్చేది..
ఈ Make In India కాన్సెప్ట్ వల్లే కదా మొబైల్ పరిశ్రమలు శ్రీ సిటీ.లో ప్రారంభం అయ్యాయి. కియా కూడా ప్లాంట్ పెట్టింది. తిరుపతిలో hardware పరిశ్రమలు తొందరగా ప్రారంభం అయ్యాయి..


21. క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ వసతులు రాష్ట్రంలో మూడు చోట్ల ఏర్పాటు అయ్యాయి.


70 ఏళ్ళు కాంగ్రెస్ టీడీపీ ఈ 13 జిల్లాల అధికారాన్ని  అనుభవించేసి తరువాత ఇప్పుడు సడన్ గా ఆంధ్రా వెనుకబాటు తనం గుర్తుకు వచ్చింది.
ఎదో కెసిఆర్ పుణ్యమా అని రాష్ట్రం విడగొట్టబట్టి మన టీడీపీ కాంగ్రెస్ నాయకులకు ఇప్పటికి అయినా ఉమ్మడి రాష్ట్రంలో ఈ 13 జిల్లాలు ఉన్న సంగతి గుర్తుకు వచ్చింది.


రాష్ట్రం విడిపోక ముందే పోలవరం 30 సం.ల ముందు అనుకున్నారు కదా..ఎందుకు పూర్తి చెయ్యలేదు? 
2014 లో రాష్ట్రం విడిపోతుంది. అప్పుడు బీజేపీ వస్తుంది నిధులు ఇస్తుంది అనుకోని ఆపేసారా? 
రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ తీసుకోండి. రాష్ట్రం విడిపోవడానికి వాటికి ఏమిటీ సంబంధం?  2003 లో రైల్వే జోన్ భువనేశ్వర్లో పెడుతున్నప్పుడు బాబుగారు NDA కన్వీనర్. ఆంధ్రా ముఖ్యమంత్రి. అది భువనేశ్వర్ లో పెట్టడం ఎందుకు ఆపలేదు? వైజాగ్ లో పెట్టడానికి ఎందుకు వత్తిడి తేలేదు. ఎందుకంటే అప్పుడు ఆంధ్రా అంటే బాబుగారికి హైదరాబాద్ మాత్రమే..  ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ కూడా వచ్చింది. వచ్చింది అని ఆనందించకుండా దానిలో కూడా లోపాలు వెతుకుతోంది తెలుగు మీడియా.
బీజేపీని విమర్శించేముందు 70 సం.లుగా మనలని పాలిస్తున్న మన టీడీపీ కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్యే లను చొక్కాలు పట్టుకు అడగండి మా 13 జిల్లాలని ఎందుకు పట్టించుకోలేదు ఇన్ని సంవత్సరాలు నుంచి అని..
అయినా మోడీ నే తిడతాం. అంటే ..
గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది అని సామెత మనకు అక్షరాలా సరిపోతుంది.  అలా నమ్మించగలిగే తెలుగు మీడియా మనకి ఉంది.
అందుకే పచ్చ మీడియా మాయలో పడి స్వంత ఆలోచనను వదిలేసిన కొందరు మోడీని తిడుతున్న వాళ్ళను చూస్తే  జాలి వేస్తోంది తప్ప బాధ కలగడం లేదు.

No comments:

Post a Comment